నవగ్రహ పూజా మహిమ (1964)

చిత్రం: నవగ్రహ పూజా మహిమ (1964)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: జి. కృష్ణమూర్తి
నేపధ్య గానం: ఘంటసాల, జానకి

పల్లవి:

ఏనాడు ఎడబాసి లేమే...
ఈనాడు విడిపొయినామే...
మేనే ఇటనుండే నా మనసు నీ చెంత నుండే ..

ఎవ్వరో ఎందుకీ రీతీ సాధింతురు ..
ఎవ్వరో ఏల పగబూని బాధింతురు...
కాదు తలవ్రాతయు..దేవతల కోపము కాదు...
ఇది మానవుని మోసము
ఎవ్వరో ఎందుకీ రీతీ సాధింతురు...

ఎవ్వారహో... ఆలపించిరీ...ఎద వీణ సవరించిరీ..
మైమరచి నిదురించినా ...నా కనులు తెరిపించిరి..

చరణం 1:

కళ్ళలో గాలి తోలుతాడ మాటాడును...
ముళ్ళలో త్రోసి కసి తోడ వేటాడును
మంచినీ చేయును ...వంచనా చేయును..
నమ్మగా గోంతులే కోయును...

ఎక్కడుంటివో ఓయి గాయకా..నా మేను పులకించక
గానమందునా లీన మైతిని...నేనే నీ దాననైతిని

ఎవ్వరో ఎందుకీ సాధింతురు ..ఎవారో ఏల పగ బూని బాధింతురు 
కాదు తలవ్రాతాయు దేవతల కోపము కాదు..ఇది మానవుని మోసము

No comments:

Post a Comment