Labels
Showing posts with label M. Show all posts
Showing posts with label M. Show all posts
మల్లీశ్వరి (1951)
చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : ఘంటసాల, భానుమతి
పల్లవి:
ఔనా... నిజమేనా...
ఔనా.. నిజమేనా..
మరతునన్న మరవలేని మమతలన్ని కలలేనా
రాణివాసమేగేవా.. బావ మాట మరచేవా..
ఔనా.. నిజమేనా
ఔనా..
చరణం 1:
మనసులోనా మరులు గొలిపి కడకు మాయమాయేనా
ప్రాణమున్న మల్లి పోయి.. రాతి బొమ్మ మిగిలేనా
ఔనా.. నిజమేనా
ఔనా...
చరణం 2:
ఔనా... కలలేనా
ఔనా... కలలేనా
నాటి కథలు వ్యధలేనా.. నీటి పైని అలలేనా
బావ నాకు కరువేనా.. బ్రతుకు యింక బరువేనా
ఔనా.. కలలేనా
చరణం 3:
పగలు లేని రేయి వోలే.. పలుకలేని రాయి వోలే
బరువు బ్రతుకు మిగిలేనా.. వలపులన్నీ కలలేనా
ఔనా.. కలలేనా
ఔనా..కలలేనా
చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : భానుమతి
పల్లవి:
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో
చరణం 1:
కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయజూచితిని
గడియ యేని యిక విడిచిపోకుమా
గడియ యేని యిక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో
ఎంత హాయి యీ రేయి నిండెనో
చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : భానుమతి
పల్లవి:
పిలిచినా బిగువటరా.. ఔరౌరా
పిలిచినా.. బిగువటరా.. ఔరౌరా
పిలిచినా బిగువటరా.. ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన..
పిలిచినా బిగువటరా.. ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా..
భళిరా రాజా..
చరణం 1:
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా...
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా... బిగువటరా
చరణం 2:
గాలుల తేలెడు గాఢపు మమతలు
గాలుల తేలెడు గాఢపు మమతలు
నీలపు మబ్బుల నీడలు కదలెను
అందెల రవళుల సందడి మరిమరి
అందెల రవళుల.. ఆ.. ఆ.. ఆ..
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
అందగాడా ఇటు తొందర చేయగా
పిలిచినా బిగువటరా ఔరౌరా..
పిలచిన బిగువటరా
చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : ఘంటసాల, భానుమతి
పల్లవి:
ఓ....ఓ...
హేయ్! పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి
హేయ్! పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి
హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి.. మన ఊరు చేరాలి
ఓ.....హోరుగాలి కారుమబ్బులు
హోరుగాలి కారుమబ్బులు... ముసిరేలోగా మూగేలోగా
ఊరు చేరాలి.. మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు.. ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ....
గలగల గలగల కొమ్ముల గజ్జెలు.. ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ....
వాగులుదాటి.. వంకలు దాటి.. ఊరు చేరాలి.. మన ఊరు చేరాలి
చరణం 1:
ఆ......ఆ.....ఆ....... అవిగో అవిగో..
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు.. అవిగో అవిగో.. అవిగో అవిగో
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు... అవిగో అవిగో అవిగో
ఆ...ఆ... పచ్చనితోటలు విచ్చిన పూవులు
ఊగే గాలుల తూగే తీగలు అవిగో...
కొమ్మల మూగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో..
ఆ...ఆ......ఆ....ఆ....... ఆ...ఆ......ఆ....ఆ.......
చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : భానుమతి
పల్లవి:
ఓ..ఓ..
కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట
కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట
మల్లీ మాలతి వస్తారా మాలికలల్లి తెస్తారా
బంతి జాజి చేమంతి బంతులు కట్టి తెస్తారా.. బంతులు కట్టి తెస్తారా...
పెళ్ళికి మీరు వస్తారా? పేరంటానికి వస్తారా?
చరణం 1:
పందిరి వేస్తాము.. ముందర ముగ్గులు పెడతాము
పందిరి కింద పెళ్ళివారికి విందులు చేస్తాము.. బాగా విందులు చేస్తాము
బాకా బాజా డోలూ సన్నాయ్ ..
బాకా బాజా డోలూ సన్నాయ్.. బాకా బాజా డోలూ సన్నాయ్
మేళాలెడతారు తప్పెట తాళాలెడతారు... తప్పెట తాళాలెడతారు
కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట...
చరణం 2:
అందాలా మా బావగారికి గంధాలు పూసి
ఓ..గారాల మా బావ మెడలో హారాలు వేసి
కుళ్ళాయెడతాము... కుచ్చుల తురాయి పెడతాము
హారాలేసీ.. గంధం పూసీ... కుళ్ళేయేసి తురాయి పెడతాము
కుచ్చుల తురాయి పెడతాము
ఓ..పల్లకి యెక్కి ...
పల్లకి యెక్కి కోతీ బావా పళ్ళికిలిస్తాడు
బావా పళ్ళికిలిస్తాడు...
మా కోతీ బావా పళ్ళికిలిస్తాడు..
కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట..
చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : భానుమతి
పల్లవి:
ఎందుకే నీకింత తొందరా
ఇన్నాళ్ళ చెరసాల ఈ రేయి తీరునే
ఎందుకే నీకింత తొందర
ఓ చిలుక.. నా చిలుకా..ఆ
ఓ చిలుక.. నా చిలుకా... ఓ రామచిలుక..
వయ్యారి చిలుక.. నా గారాల మొలక..
ఎందుకే నీకింత తొందరా
చరణం 1:
బాధలన్నీ పాత గాధలైపోవునే
బాధలన్నీ పాత గాధలైపోవునే
వంతలన్నీ వెలుగు పుంతలో మాయునే
యేలాగో ఓలాగు ఈ రేయి దాటెనా....ఈ రేయి దాటెనా
ఈ పంజరపు బ్రతుకు ఇక నీకు తీరునే
ఎందుకే నీకింత తొందర
చరణం 2:
ఆ చోట ఆ చోట ఆ తోపు ఆకుపచ్చని గూడు
ఆ వంక గొరవంక అన్నీ ఉన్నాయి లే
ఆ వంక గొరవంక అన్నీ ఉన్నాయి లే
చిరుగాలి తరగలా.. చిన్నారి పడవలా
పసరు రెక్కలు పరచి పరువెత్తి పోదాము
ఎందుకే నీకింత తొందర
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : ఘంటసాల, భానుమతి
పల్లవి:
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావా..
ఏడ తానున్నాడో బావా..
జాడ తెలిసిన పోయిరావా ఆ ఆ ఆ
అందాల ఓ మేఘమాలా ఆ ఆ ఆ
చందాల ఓ మేఘమాలా..
గగనసీమల తేలు ఓ మేఘమాల
మా ఊరు గుడి పైన మసలి వస్తున్నావా..
మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పి పోవా ఆ...
నీలాల ఓ మేఘమాల ఆ.. రాగాల ఓ మేఘమాల
చరణం 1:
మమతలెరిగిన మేఘమాలా
నా..మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నాకళ్ళు దిగులుతో రేపవలు
ఎన్నాళ్ళు నాకళ్ళు దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూచేనే
బావకై చెదరి కాయలు కాచెనే ఏ ఏ ఏ
నీలాల ఓ మేఘమాలా ఆ.. రాగాలా ఓ మేఘమాలా
చరణం 2:
మనసు తెలిసిన మేఘమాలా ఆ ఆ..
మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరచినగాని కళ్లు మూసినగాని
కళ్ళు తెరచినగాని కళ్లు మూసినగాని
మల్లి రూపే నిలిచేనే నా చెంత మల్లి మాటే పిలిచెనే
చరణం 3:
జాలి గుండెల మేఘమాలా
బావ లేనిది బ్రతుకజాలా
జాలి గుండెల మేఘమాలా...
కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసిపోవా
కన్నీరు ఆనవాలుగ బావ మ్రోల...
Subscribe to:
Posts (Atom)
